ఆంధ్రప్రదేశ్‌

తిత్లీ సహాయ నిధికి ప్రతిపక్ష సభ్యుల జీతాలు అడుగుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 23: శాసన మండలి, శాసన సభ సభ్యులు తరుఫున ఒక నెల జీతాన్ని తిత్లీ బాధితులకు సాయంగా ప్రకటించామని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసన మండలి, శాసన సభ సభ్యులను కూడా వారి ఒక నెల జీతం ఇవ్వాలని అడుగుతామని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు స్పందిస్తే మంచి పరిణామమేనని, లేకుంటే అధికార పార్టీ శాసన మండలి, శాసన సభ్యులు జీతాలు ఇస్తామని వెల్లడించారు. తిత్లీ తుపాను నష్టాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రిక్త హస్తమే చూపించిందని, ఇంకా కేంద్రం సర్వే బృందాలు పరిశీలకు వచ్చి అంచనాలు వేసి, లెక్కలు కట్టి సాయం అందిస్తుందంటూ కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయని, ఆ ప్రక్రియ ఎంత త్వరగా చేస్తే, బాధితులకు అంత ఊరట కలుగుతుందన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలాస మండలం పెద్ద గురుదాసుపురంలో మాట్లాడారు. తిత్లీ తుపానుతో నష్టపోయిన రైతాంగం త్వరగా కోలుకోవాలంటే మొక్కలు పెంపకంతోపాటు అంతరపంటలు వేసుకోవడం చాలా ముఖ్యమంటూ అక్కడ రైతులతో మాట్లాడుతూ సూచించారు. తన కుటుంబం తరుఫున ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. మూడేళ్ళలో ఫలసాయం ఇచ్చే మొక్కలు ఉపాధి హామీ పథకం నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆదుకుంటుందన్నారు. సోంపేట మండలంలో నేలమట్టమైన కొబ్బరి తోటలు, జీడిమామిడి, పడిపోయిన ఇళ్లను స్పీకర్ శివప్రసాద్ పరిశీలించారు. ఉద్దానానికి తీవ్రమైన నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని మరింత వేగవంతంగా పూరించడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్నారు. హుదూద్ తుపాను నేర్పిన పాఠాలతో తిత్లీ తుపానులో అపార నష్టాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలన్నది ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలో పెట్టి చూపించిందన్నారు. ఎర్రముక్కాంలో తుపాను బాధితులతో స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మండల ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులను పరామర్శించి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరకులు, నీరు అందుతున్నదీ లేనిది ప్రజలను అడిగి స్పీకర్ తెలుసుకున్నారు. రాజాం దారిపోడవునా జీడితోటలు, కొబ్బరి తోటలను పరిశీలించారు. తీవ్రంగా నష్టం వాటిల్లిందని, తాను గుంటూరు వాసినేనని సముద్రం పక్కనే మా ఊరు ఉందని ఏనాడూ ఇంత నష్టం జరగలేదని బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడారు. తిత్లీ తుపాను వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తిత్లీ తుపాను బాధితులంతా త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వానే్న పలాసలో ఉంచి అధికారులంతా పనిచేస్తున్నారన్నారు. స్వదేశీ మత్స్యకారులకు (కండ్రకులస్థులు) గ్రామాన్ని సందర్శించిన స్పీకర్ ఇళ్ళపై ఉన్న రేకులు తిత్లీ తుపానుకు ఎగిరిపోయిన ఇళ్ళను పరిశీలించారు. వలలు పోయాయని గ్రామస్తులు చెప్పడంతో వలలు సంపాదించుకొనేందుకు రెండు నెలలు పడుతుందని అంత వరకూ బియ్యం సరఫరా చేయాలని మత్స్యకారులు స్పీకర్‌ను కోరారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని స్పీకర్ చెప్పారు. స్పీకర్‌తోపాటు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, అధికారులు ఉన్నారు. అంతకుముందు ఆర్ అండ్ బి వసతి గృహంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి, జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కలిసారు. తిత్లీ తుపాను భీభత్సాన్ని కలెక్టర్ వివరించారు. తుపాను హెచ్చరికలు అందినవెంటనే ప్రాణనష్టం పెద్దఎత్తున జరగకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను చైతన్యపరచడం వల్ల ప్రాణనష్టం తగ్గించగలిగినా, ఆస్తినష్టాన్ని ఆపలేకపోయామని ప్రభుత్వ విప్‌తోపాటు కలెక్టర్, జెసీలు స్పీకర్‌కు వివరించారు.

చిత్రం.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో తిత్లీ నష్టాన్ని పరిశీలిస్తున్న స్పీకర్ కోడెల