ఆంధ్రప్రదేశ్‌

సీపీఎం రాస్తారోకోకు సీపీఐ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: కరవు తీవ్రత, సహాయ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 12న రాయలసీమ జిల్లాలో జరగనున్న రాస్తారోకోలకు సీపీఐ మద్దతు తెలియజేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితి నెలకొందని, రాష్ట్రం మొత్తం మీద దాదాపు 60 శాతం ప్రాంతం దుర్భిక్షంగా మారిందని అన్నారు. కరవు తీవ్రత ఇదే విధంగా కొనసాగితే రానున్న వేసవికాలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటుందనడంలో సందేహం లేదని హెచ్చరించారు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాభావం కారణంగా పంట పొలాలు బీడువారతున్నాయని రామకృష్ణ వివరించారు.