ఆంధ్రప్రదేశ్‌

బీజేపీకి పవన్ మరో అధికార ప్రతినిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారని, ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌కు డూపుగా నటిస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ బీజేపీకి అద్దెమైకులా మారిన పవన్ ఆ పార్టీ పల్లవినే వల్లెవేస్తున్నారన్నారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం కలుగుతుందన్నారు. ప్రశ్నించడానికి వచ్చానని చెప్పే పవన్‌కు నిజంగా పరిపక్వత లేదని, రోజుకో రకంగా, ప్రాంతానికో విధంగా మాట్లాడుతూ తనలోని ఆజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నాడని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షా జోడీకి పవన్ మరో జీవీఎల్‌లా మారారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. గతంలో తన అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు తనకే తప్పు కనిపించలేదన్న పవన్.. నేడు చంద్రబాబు, కాంగ్రెస్‌తో కలిసి మోదీ నిరంకుశతత్వంపై పోరాటం చేస్తుంటే ఏ దురుద్దేశంతో ప్రశ్నిస్తున్నారన్నారు.