ఆంధ్రప్రదేశ్‌

19 నుంచి భవానీ దీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) నవంబర్ 8: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో అమ్మవారి భవానీదీక్షలు ఈనెల 19వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 29వ తేదీతోపరిసమాప్తం కానున్నట్లు దేవస్థానం ఈవో వి కోటేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. కనకదుర్గమ్మ సన్నిధిలో అర్ధ మండల దీక్షలు మార్గశిర శుద్ధ విదియ నుండి మార్గశిర శుద్ధ షష్టి.. డిసెంబర్ 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగుతాయి. డిసెంబర్ 22వ తేదీన కలశ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం సత్యనారాయణ పురం రామకోటి నుండి ప్రారంభం కానుంది. అమ్మవారి భవానీదీక్షల విరమణ కార్యక్రమం డిసెంబర్ 29వ తేదీన ప్రారంభమై జనవరి 2వ తేదీన వరకు ఐదురోజులు పాటు నిర్వహిస్తున్నట్లు ఈవో వి కోటేశ్వరమ్మ తెలిపారు.