ఆంధ్రప్రదేశ్‌

కర్ణాటక ఫలితాలతో చంద్రబాబు శక్తి తెలిసొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు చంద్రబాబు నాయకత్వ పటిమ ఏమిటో మోదీకి తెలిసోచ్చేలా చేశాయని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడ స్టేట్‌గెస్ట్ హౌస్‌లో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా తనను ఎదురించేవారే లేరని తానేం చేసినా, ఎలా ప్రవర్తించినా ప్రశ్నించే వారే లేరని అధికార మదంతో విర్రవీగే ప్రధానికి, కర్నాటక ఉప ఫలితాలు దిమ్మతిరిగేలా చేశాయన్నారు. ఉప ఎన్నికల ఫలితాలలో మోదీ తొత్తులుగా మారిన కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, తన అన్నగాని అన్న గాలి జనార్ధన్‌రెడ్డి దెబ్బతో జగన్.. ప్రజలకు ముఖం చూపించలేక, మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారని బుద్దా ఎద్దేవా చేశారు. నిత్యం అవాకులు, చవాకులు పేలుతూ, అవాస్తవాలు అసత్యాలతో టీడీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురదజల్లేలా వ్యవహరించే కన్నా, జీవీఎల్ తన ముఖాలు తెలుగు ప్రజలకు చూపించలేక సిగ్గుతో కునారిల్లుతున్నారని వ్యాఖ్యానించారు.