ఆంధ్రప్రదేశ్
ఎర్రచందనం స్మగ్లింగ్పై ఉక్కుపాదం: మహేష్ శర్మ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తిరుపతి, నవంబర్ 10: శేషాచల కొండల్లోని విలువైన ఎర్రచందనం పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర అటవీశాఖ మంత్రి మహేష్ శర్మ అన్నారు. శనివారం తిరుమలేశుని దర్శనానికి వచ్చిన ఆయనకు తిరుగుప్రయాణంలో తిరుపతిలోని ఎర్రచందనం గోడౌన్ను పరిశీలించారు. ఎర్రచందనం గ్రేడింగ్ గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్మగ్లింగ్ జరుగుతున్న తీరు తెన్నుల గురించి ఈ సందర్భంగా అధికారులు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ దీనిపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అలాగే స్మగ్లింగ్ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. స్మగ్లింగ్ అరికట్టడానికి ప్రత్యేకంగా టాస్క్పోర్స్ను ఏర్పాటు చేశామని, తద్వారా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు.