ఆంధ్రప్రదేశ్‌

ఏ విచారణకైనా ప్రభుత్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం(విశాఖ), నవంబర్ 12: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం ఏ విచారణకైనా సిద్ధంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేసారు. ఈకేసును టీడీపీ ప్రభుత్వం నీరుకార్చుతోందని జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఆరోపించడం సరికాదన్నారు. సోమవారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు విలేఖరులతో మాట్లాడుతూ జగన్‌పై జరిగింది హత్యాయత్నమేనని విజయమ్మ పేర్కొనడం విచారకరమన్నారు. తల్లికి కొడుకుపై ప్రేమ ఉండడం సహజమేనని , దీనిలో ఏమాత్రం తప్పు లేదన్నారు. అయితే కొడుకును సక్రమమార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదేనన్న సంగతిని కూడా విజయమ్మ గ్రహించాలన్నారు. జగన్ సహకరించకపోతే విచారణ ఎలా ముందుకు సాగుతుందన్నారు. పోలీసులకు సహకరించాలని కోర్టు చెప్పిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు . హత్యలతో రాజకీయాలు చేయలేమన్నారు. అది సాంప్రదాయం కూడా కాదని పేర్కొన్నారు. హత్యారాజకీయాలు చేయించే సంస్కృతి, అలవాటు తమ నాయకుడు చంద్రబాబుకు లేదన్నారు.