ఆంధ్రప్రదేశ్‌

ఓట్ల కోసమే భారీ ప్రకటనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 7: ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణాలో ఓట్ల కోసం అక్కడ ప్రజలను మభ్యపెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారని శుక్రవారం ట్విట్టర్ వేదికగా జగన్ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రభుత్వం తరుపున భారీ ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు. ఇళ్ళు కట్టాం..పరిశ్రమలు పెట్టాం...అభివృద్దిలో దూసుకుపోతున్నాం అంటూ చంద్రబాబు లేనిపోని కోతలు కోశారన్నారు. తిరుపతిలో జరిగిన సభలో మా ఉద్యోగాలేవి అని అడిగిన డీఎస్సీ అభ్యర్థులను అవమానించిన తీరు చంద్రబాబు నిజరూపానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మా ఉద్యోగాలేవి అని డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తే తమాషాగా ఉందా అంటూ వారిపై చంద్రబాబు విరుచుకుపడ్డారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలకు ఇది నిదర్శనమన్నారు. ప్రశ్నించిన వారిపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.