ఆంధ్రప్రదేశ్‌

కొనసాగుతున్న గుజరాత్ ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), డిసెంబర్ 12: ప్రో కబడ్డీ సీజన్ 6లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. విశాఖ పోర్టు రాజీవ్‌గాంధీ స్టేడియంలో హర్యానా స్టీలర్స్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 47-37 పాయింట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో గుజరాత్ జట్టు 82 పాయింట్లతో పూల్ ఏలో అగ్రస్థానం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు డిఫెన్స్, రైడింగ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ విరామ సమయానికి 28-16 పాయింట్లు సాధించింది. జట్టు స్టార్ రైడర్లు సచిన్, ప్రభంజన్ చెలరేగిపోయారు. ప్రభంజన్ 12, సచిన్ 10 పాయింట్లు సాధించారు. డిఫెన్స్‌లో సునీల్, రుతురాజ్, పర్వీష్‌లు నాలుగేసి పాయింట్లు సాధించారు. హర్యానా జట్టులో మోనూ గోయిట్ 11 పాయింట్లు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది.
అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 37-24 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. ప్లే ఆఫ్స్ అవకాశాల్లో భాగంగా జరిగిన కీలకమైన ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఓటమి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మరోవైపు ఈ విజయంతో బెంగళూరు బుల్స్ జోన్ బీలో 64 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.