ఆంధ్రప్రదేశ్‌

వికటించిన వ్యాక్సిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 12: వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పించే పెంటావాలెంట్ వ్యాక్సిన్ వికటించి, రెండున్నర నెలల చిన్నారి కన్నుమూసిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి. అమలాపురం రూరల్ మండలం విత్తనాలవారి కాలువగట్టుకు చెందిన కర్రి వౌనిక రెండున్నర నెలల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం అమలాపురంలోని శ్రీరాంనగర్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఈ చిన్నారికి పెంటావాలెంట్ వ్యాక్సిన్ వేయించారు. ఉదయం 10.30 గంటల సమయంలో వ్యాక్సిన్ వేయించగా, సాయంత్రం 4.30 గంటల సమయంలో చిన్నారికి విరోచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. దీనితో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చిన్నారిని అమలాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా ఈ చిన్నారితో పాటు అదే శిబిరంలో పది మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేశారని, అయితే వారంతా బాగానే ఉన్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు.