ఆంధ్రప్రదేశ్‌

రాఫెల్‌పై జేపీసీ ఏర్పాటుకు భయమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి నిజం నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రరత్నభవన్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజల అనుమానాలు నివృత్తి చేసేందుకు లోక్‌సభ, రాజ్యసభలోని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి నిజం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తులసిరెడ్డి అన్నారు.