ఆంధ్రప్రదేశ్‌

వైద్య పరికరాల ఎగుమతులపై ‘మెడ్‌టెక్’ ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, డిసెంబర్ 15: వైద్య పరికరాలు, విడి భాగాల ఎగుమతులతో ప్రపంచ దేశాల్లో విశాఖపట్నం మెడ్‌టెక్ ముద్ర పడుతుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో రెండు నెలల్లో ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో తయారయ్యే పరికరాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ ప్రాముఖ్యతపై మాలకొండయ్య ‘ఆంధ్రభూమి’కి శనివారం వివరించారు. దక్షణ ఆసియాలో ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌లో మాత్రమే సకల సౌకర్యాలతో వైద్య పరికరాల తయారీకి అవకాశాలు ఉన్నాయన్నారు. వైద్య ఉపకరణాలు, విడి భాగాల తయారీ మొదలుకొని తనిఖీ, ధ్రువీకరణల వరకు దేశంలో అన్నీ ఒకే చోట ఉన్న ప్రాంగణం విశాఖ మెడ్‌టెక్ జోన్ అన్నారు. జోన్‌లోని వివిధ పరిశ్రమల్లో తయారయ్యే పరికరాలు భవిష్యత్ జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల్లో కనిపిస్తాయన్నారు. ఆయా దేశాల్లో విశాఖలో తయారైన వైద్య పరికరాల ఉత్పత్తి లభ్యతతో మెడ్‌టెక్ జోన్ మార్కు కనిపిస్తోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు వైద్య పరికరాల తయారీ సంస్థల ఏర్పాటుకు మార్గదర్శకత్వం వహిస్తున్నారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖలు విశాఖ మెడ్‌టెక్ జోన్ ప్రాముఖ్యతను ప్రపంచ దేశాల పెట్టబడిదారుల దృష్టికి తీసుకు పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నారు. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో కచ్చితమైన ఫలితాలను తెలిపే వైద్య పరికరాలు తయారు అవుతాయన్నారు. గర్భిణులకు వైద్య పరీక్షలను నిర్వహించేందుకు సరికొత్త పరికరాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. రక్త పరీక్షలు, రక్తపోటు తనిఖీలను అత్యంత కచ్చిత్వతంతో ఆశ కార్యకర్తలు కూడా నిర్వహించేలా పరికరాన్ని రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా గర్భిణులులు, చిన్నారులు తరుచుగా రక్త నమూనాలను ఇవ్వాల్సి వచ్చినప్పుడు తరుచూ అసౌకర్యానికి గురవుతున్నారని, ఈ నూతన పరికరంతో అటువంటి సమస్యలకు చెక్ పెట్ట వచ్చునన్నారు.
2020లో విశాఖ వేదికగా డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ సదస్సు
ఉక్కునగరం: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020లో 5వ అంతర్జాతీయ సదస్సును విశాఖపట్నంలోనే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్‌లో ఏర్పాటవుతున్న పరిశ్రమల ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు 5వ అంతర్జాతీయ సదస్సును విశాఖపట్నంలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడ్‌టెక్ ప్రారంభం రోజునే కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో 2020లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకారం కూడా లాంఛనీయం కానున్నదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.