ఆంధ్రప్రదేశ్‌

17 నుండి పీఏసీఎస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 15: వేతన సవరణతో పాటు పలు సమస్యల పరిష్కారం కోరుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలలో (పీఏసీఎస్) పని చేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 17 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు ఏపీస్టేట్ అగ్రికల్చరల్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఈసమ్మెకు స్పష్టం చేసింది. ఉద్యోగుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని గతంలో హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 14 నుండి తలపెట్టిన సమ్మెను ఉద్యోగులు వాయిదా వేసుకున్న సందర్భంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరవధిక సమ్మె నిర్ణయం తీసుకున్నారు.
యూనియన్ అనుబంధాలతో సంబంధం లేకుండా ఈ సమ్మెలో వ్యవసాయ పరపతి సంఘాలలో పని చేస్తున్న ఉద్యోగులందరూ నిర్ణయించారు. 2014 ఏప్రిల్ నుండి వేతనాలను సవరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ సవరించకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్సిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.