ఆంధ్రప్రదేశ్‌

ప్రజాకోర్టు నుంచి మోదీ తప్పించుకోలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: రాఫెల్ కుంభకోణంపై సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిందని జబ్బలు చరుచుకుంటున్న ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రజాకోర్టులో దోషులుగా నిలవడం ఖాయమని, దేశ రాజకీయాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితం చేసిన కుంభకోణం నుంచి బీజేపీ అంత తేలిగ్గా తప్పించుకోలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకోవడం మోదీ, షా ద్వయానికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియదన్న సంగతి ఇప్పటికే దేశ ప్రజలందరికీ అర్థమైందన్నారు. బీజేపీ నిజంగా ఏ తప్పూ చేయనప్పుడు రాఫెల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయపడానికి ఎందుకు వెనుకంజ వేస్తుందో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల ద్వారా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులను మేనేజ్ చేయలేమన్న భయంతోనే అరకొర సమాచారంతో సుప్రీంను ఆశ్రయించి, ఆ కోర్టు ఇచ్చిన తీర్పుతో తామంతా సచ్ఛీలురైనట్లు బీజేపీ నేతలు భావిస్తే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదని యామినీ శర్మ తేల్చి చెప్పారు.
ఒక అర్చకుడి మరణాన్ని ఏపీ ప్రభుత్వానికి ఆపాదించాలని, తద్వారా తమకు మేలు చేకూర్చుకోవాలని భావిస్తున్న వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయన్నారు. ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, కోన రఘుపతి బ్రాహ్మణుల ముసుగులో తెలుగుదేశంపై బురదజల్లాలని చూడడం ఎంత మాత్రం భావ్యం కాదన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి దుర్మార్గపు చర్యలను దివంగత వైఎస్ నుంచి వైసీపీ అధినేత జగన్‌కు వారసత్వంగా లభించాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రూ. 285 కోట్లను బ్రాహ్మణుల సంక్షేమానికి వినియోగించారన్నారు.