రాష్ట్రీయం

సమస్యలపై కదం తొక్కిన సింగరేణి కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 18: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద వేలాది మంది కార్మికులు భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన పోరుయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలోని 11 ఏరియాల నుండి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.