ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రిని కలిసిన కళారంగ ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 9: ఇటీవల నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైన పలువురు సినీ, కళారంగ ప్రముఖులు ఉండవల్లిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. జానపద అకాడమీ చైర్మన్‌గా నియమితులైన పొట్లూరి హరికృష్ణ, సంగీత, నృత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులైన వందేమాతరం శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ ప్రముఖ రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు ముఖ్యమంత్రిని కలుసుకుని తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయబోమని, తమవంతు కర్తవ్యాలను నెరవేరుస్తామని వివరించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తమవంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన చంద్రన్న నాటకవరం- శనివారం పోస్టర్‌ను, చంద్రన్న పాలనా విజయాల పేరిట రూపొందించిన ఆడియో, వీడియో సీడీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

చిత్రం..ముఖ్యమంత్రిని కలిసిన వందేమాతరం
శ్రీనివాస్, గుమ్మడి గోపాలకృష్ణ, పొట్లూరి హరికృష్ణ