ఆంధ్రప్రదేశ్
వంచన యాత్రగా మిగిలిన జగన్ పాదయాత్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 January 2019
విజయవాడ, జనవరి 9: ప్రతిపక్ష నేత జగన్ నిర్వహించిన పాదయాత్ర తన స్వప్రయోజనాల కోసమేనని, ప్రజల కోసం కాదని రాష్ట్ర మంత్రి కళా వెంకటరావు విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ, కేసీఆర్లను పల్లెత్తు మాట అనకుండా ప్రసంగించడంతో ఇది వంచన యాత్రగా మారిందని ఆరోపించారు. ప్రజా స్పందన లేకపోవడంతో కోడికత్తి డ్రామా ఆడి, కుట్ర బయటపడకుండా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించుకుంటున్నారని విమర్శించారు. నవరత్నాలు పేరుతో నాలుగు గులకరాళ్లతో ప్రజలను మోసం చేసే యత్నమని విమర్శించారు.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి, కాపులు, రజకులు, వాల్మీకుల రిజర్వేషన్లపై రాష్ట్రం పంపిన తీర్మానాలు, విభజన హామీల అమలుపై ఎందుకు పాదయాత్ర ముగింపు ప్రసంగంలో మోదీని నిలదీయలేదని ప్రశ్నించారు.