ఆంధ్రప్రదేశ్‌

జమ్మలమడుగు వైకాపా అభ్యర్థిగా సుధీర్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 13: వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా జమ్మలమడుగు నుంచి వైకాపా తరఫున డాక్టర్ సుధీర్‌రెడ్డి పోటీచేయనున్నారు. ఈ మేరకు సుధీర్ అభ్యర్థిత్వాన్ని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆదివారం పులివెందులలో ఖరారు చేశారు. తనను కలిసేందుకు వచ్చిన సుధీర్‌తో సుధీర్ఘ మంతనాలు జరిపిన జగన్ బయటకు వచ్జి జమ్మలమడుగు నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో సుధీర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో సుధీర్ అనుచరుల్లో సంతోషం వెల్లివిరిసింది. కాగా జమ్మమడుగు టికెట్ ఆశించిన మైలవరం మాజీ మండలాధ్యక్షురాలు అల్లె ప్రభావతి అలకబూనారు. కార్యకర్తలతో కలిసి జగన్ ఇంటి ఎదుట బైఠాయించారు. దీంతో జగన్ ఆమెకు నచ్చజెప్పడంతో మెత్తబడ్డారు.