ఆంధ్రప్రదేశ్‌

పులివెందులలో జగన్ ప్రజాదర్బార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జనవరి 13: వైకాపా అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న పొరుగుశాఖ ఉద్యోగులు జగన్‌ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ఎన్‌టీఆర్ వైద్యశాఖ జిల్లా అధ్యక్షులు ప్రసాద్‌నాయుడు ఆధ్వర్యంలో ఉద్యోగులు జగన్‌ను కలిసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే వేతనాలు పెంచాలని ఆయనకు వినతిపత్రం అందించారు. దీనికి జగన్ స్పందిస్తూ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యను పరిశీలిస్తామన్నారు.
మైదుకూరు, కోడూరు, కడప ఎమ్మెల్యేలు రఘునాథరెడ్డి, శ్రీనివాసులు, అంజాద్‌బాష, కడప మేయర్ సురేష్‌బాబు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్, జమ్మలమడుగు వైకాపా ఇన్‌చార్జి సుధాకర్‌రెడ్డి, వైకాపా మహిళా నేత అల్లె ప్రభావతి తదితరులు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పులివెందుల నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో జగన్ చర్చించారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగించుకున్న జగన్ ఆదివారం రాత్రి హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు.