ఆంధ్రప్రదేశ్‌

మహిళల్ని కించపరిచే సంస్కృతి వైసీపీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 14: మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టించిన సంస్కృతి, చరిత్ర వైసీపీ నాయకులదేననే విషయాన్ని వైఎస్ షర్మిల గుర్తుంచుకోవాలని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. సోమవారం ఇక్కడి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేను కించపరుస్తూ అసభ్యకరంగా పోస్టింగులు పెట్టించిన విష్పుయాన్ని మీరు మర్చిపోయినా, ప్రజలు మరవలేదన్నారు.
మహిళా శాసనసభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేసి కంటతడి పెట్టించిన ఘనుడు మీ సోదరుడు జగనేనన్న వాస్తవాన్ని గుర్తెరగాలన్నారు. షర్మిలపై జరుగుతున్న ప్రచారంతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, షర్మిలతో పాటు ఏ మహిళపై ఇలాంటి ప్రచారం జరిగినా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వైసీపీ నాయకుల ఆరోపణలు అర్థరహితమంటూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఇన్నాళ్లూ ఈవిషయంలో వౌనంగా ఉండి కేవలం ఎన్నికల సమయంలో దీన్ని రాజకీయం చేసే ఉద్దేశంతోనే షర్మిల రాద్ధాంతం చేస్తున్నారని ఆమె విమర్శించారు.