ఆంధ్రప్రదేశ్‌

మహిళలను కించపరచడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 14: రాజకీయాల్లో మహిళలను కించపర్చేలా అసత్య ప్రచారాలు చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిలపై దుష్ప్రచారాలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మహిళలు ఏ రాజకీయ పార్టీల వారైనప్పటికీ తల్లి, చెల్లిలా గౌరవించాలన్నారు. రాజకీయ కుయుక్తుల కోసం మహిళలను బలిపశువులను చేయడం తగదని హితవు పలికారు. షర్మిలపై తప్పుడు ప్రచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించి షర్మిలకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరుతున్నట్లు రామకృష్ణ తెలిపారు.