ఆంధ్రప్రదేశ్‌

ఓఎన్జీసీలో యంత్ర పరికరం అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 18: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్సులో యంత్ర పరికరం అపహరణకు గురైన ఉదంతం శుక్రవారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అపహరణకు గురైన పరికరాల విలువ సుమారు రూ.100 కోట్లని, ప్రమాదకరమైన రేడియోధార్మిక ప్రభావాన్ని చూపేవని ఓ ఛానల్‌లో ప్రచారం జరగడమే ఈ కలకలానికి కారణం. అయితే ఈ విషయాన్ని ఓఎన్జీసీ వర్గాలు ఖండించాయి. పోయినది చమురు, గ్యాస్ అనే్వషణలో ఉపయోగించే యంత్ర పరికరమని ఓఎన్జీసీ శుక్రవారం రాత్రి విడుదలచేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని 2013లో రూ.27 లక్షలకు కొనుగోలు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇది ఎటువంటి ప్రమాదకరమైన వస్తువు కాదని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆ ప్రకటన పేర్కోంది. ఈ మేరకు ఓఎన్జీసీ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదుచేశారు.