ఆంధ్రప్రదేశ్‌

అగ్రకులాల మధ్య బాబు చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అధికారం కోసం అగ్రకులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. భారతీయ యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు నాగోతి రమేష్‌నాయుడు అధ్యక్షతన నగర శాఖ కార్యాలయంలో మంగళవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనేక రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రధాని మోదీ అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారన్నారు. కానీ చంద్రబాబు తన స్వార్థం కోసం మళ్లీ అగ్ర కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇందులో ఐదు శాతం కోత విధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో మాల, మాదిగల మధ్య, కాపు, బీసీల మధ్య గొడవ పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. కాపులకు రిజర్వేషన్‌లు అన్న బాబు కమిటీ పేరుతో కాలయాపన చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీసుల అండతో ప్రతిపక్షాలపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తమ ఇంటి మీదకు వచ్చిన వారంతా రౌడీ షీటర్లే అని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, మరోసారి బాబుకు అవకాశం ఇస్తే ఏపీని, ప్రజలను ఎవరూ కాపాడలేరన్నారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌నాయుడు మాట్లాడుతూ భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, సదస్సులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామన్నారు. మార్చి 2వ తేదీ వరకు ఏపీలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ