ఆంధ్రప్రదేశ్‌

నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: రానున్న పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధతపై సమీక్షించడానికి భారత ఎన్నికల సంఘం ప్రతినిధులు సోమ, మంగళవారాల్లో విజయవాడలో పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా, ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసాలతో పాటు భారత ఎన్నికల సంఘం అధికారులు ఉమేష్ సిన్హా, సందీప్ సక్సేనా, సందీప్ జైన్, నిఖిల్ కుమార్, దిలీప్ శర్మ, ధీరేంద్ర ఓఝా, ఎస్‌కే రుడోలా, తదితరులు పలు సమావేశాల్లో పాల్గొంటారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం అధికారులు 11న ఉదయం 6 గంటలకు న్యూఢిల్లీ నుండి బయలుదేరి 8.15 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటారు.