ఆంధ్రప్రదేశ్‌

రాష్టమ్రంతా ఒక్కటై రోడ్డెక్కితే..జగన్ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జనవరి 10: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలుచేయాలని కోరుతూ మోదీ పర్యటన సందర్భంగా జనం రోడ్డెక్కి రోదిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్‌మోదీరెడ్డి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. 26 కేసులకు భయపడి, దాక్కున్నారా? లేక లోటస్‌పాండ్‌లో పడుకున్నారా అని వ్యంగ్యంగా ఆదివారం ఆయన ట్వీట్‌లో ప్రశ్నించారు. ప్రధాని మోదీ గుంటూరు పర్యటన నేపథ్యంలో హోదా కోసం కనీసం నిరసన తెలపలేదని వైసీపీపై మంత్రి మండిపడ్డారు. మోదీ జైలుకు పంపుతారని జగన్‌కు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ రాష్ట్రానికి వస్తుంటే కేసులకు భయపడి జగన్ దాక్కున్నారని విమర్శించారు. మోదీ పర్యటన సందర్భంగా రాష్టమ్రంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. కనీసం వైకాపా నాయకులు కూడా రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. తన మీదున్న 26 కేసులకు సంబంధించి మోదీ ఎక్కడ జైలుకు పంపుతారేమోనని దాక్కున్నారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేస్తారనే భయంతో లోటస్‌పాండ్‌లో పడుకున్నారా అని ప్రశ్నించారు. గోబ్యాక్ మోదీ అంటూ ట్విట్టర్‌లో ఆయన నిరసన వ్యక్తం చేశారు.