ఆంధ్రప్రదేశ్‌

మోదీ గో బ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి /ఒంగోలు / నెల్లూరు, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గో బ్యాక్, మోదీ కేడీ అంటూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలతో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు హోరెత్తాయి. ఆదివారం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ రీజనల్ అధికారిణి పుష్పావతి యాదవ్ తదితర నాయకులు నల్ల దుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తానని వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన మోదీ నేడు తాను ఆ మాటే అనలేదని చెప్పడం దారుణమన్నారు. రాష్ట్భ్రావృద్ధిని పట్టించుకోకుండా, సమస్యలను పరిష్కరించకుండా కుండలో మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రధానికి ఏపీకి వచ్చే అర్హత లేదన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
ప్రధాని గుంటూరు పర్యటనను నిరసిస్తూ ఆదివారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్దనున్న రాజీవ్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పొలకల మల్లికార్జున ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా నల్లజెండాలు, మట్టికుండలు చేతపట్టుకుని ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రధాని మోదీ గుంటూరు రాకను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన ప్రదర్శన, మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రాణాలర్పిస్తాం.. ప్రత్యేక సాధిస్తామంటూ వివిధ పక్షాలకు చెందిన నాయకులు నినదించారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయం నుండి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. మోదీ గోబ్యాక్.. ఆంధ్రా ద్రోహి మోదీ, 30 వేల కోట్ల రూపాయల దొంగ అంటూ కాంగ్రెస్ పార్టీశ్రేణులు నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మను మట్టి కుండలతో కొట్టి దగ్ధం చేశారు.
నెల్లూరు జిల్లాలో..
మోదీ గుంటూరు రాకను నిరసిస్తూ నెల్లూరు జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలిపారు. మోదీ గుంటూరు రాకపై అభ్యంతరం తెలుపుతూ కావలి టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో మట్టికుండలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పతనమే టీడీపీ లక్ష్యమని, రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీకి ఏపీలో అడుగుపెట్టే హక్కే లేదని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఘాటుగా హెచ్చరించారు. గుంటూరులో ప్రధానమంత్రి మోదీ పర్యటన సందర్భంగా టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం గూడూరు పట్టణంలో ఖాళీకుండలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో తీరని అన్యాయం చేసిన మోదీ రాష్ట్రంలో పర్యటించడం సిగ్గుచేటన్నారు.
చిత్రం.. తిరుపతిలో మట్టికుండలతో నిరసన తెలుపుతున్న దృశ్యం