ఆంధ్రప్రదేశ్‌

20 మందితో పీసీసీ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో ఎన్నికలు రానున్న తరుణంలో పీసీసీ మీడియా సమన్వయ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. పీసీసీ మీడియా సమన్వయ కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఎన్ తులసిరెడ్డి, వైస్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, కన్వీనర్‌గా వణుకూరి శ్రీనివాసరెడ్డిని నియమించారు. కమిటీ సభ్యులుగా నరహరశెట్టి నరసింహారావు, అంబటి రామకృష్ణ, చుండూరు సుందర రామశర్మ, డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ సిఎల్ నాయుడు, ముసిని రామకృష్ణారావు, వింత సంజీవరెడ్డి, నీలి శ్రీనివాసరావు, బాలాజీ మనోహర్, డాక్టర్ ఎం విజయచంద్ర, తల్లూరి విజయకుమార్, గుల్లా ఏడుకొండలు, మద్ది శ్రీనివాస్, కె సుధాకర్,, పార్ధసారథిరెడ్డి, సయ్యద్ ముస్తాక్ మహ్మాద్‌లను నియమించారు.
ఘనంగా రఘువీరా జన్మదిన వేడుకలు
పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి జన్మదిన సందర్భంగా మంగళవారం పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి క్రిష్ట్ఫోర్ తిలక్ కేక్ కట్ చేశారు. ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎన్ రాజా, జంగా గౌతమ్, తాంతియకుమారి, ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.