ఆంధ్రప్రదేశ్‌

‘ఏపీలో చిల్లర రాజకీయాలు చెల్లవ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో అభివృద్ధి చెందుతోందని, టీఆర్‌ఎస్ నుండి ఇక్కడికి వచ్చి చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే చెల్లబోవని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుంటే పెదవిప్పని తలసాని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి బీసీలకు న్యాయం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న తలసాని క్రమశిక్షణ తప్పి టీఆర్‌ఎస్‌లో చేరి చిల్లర రాజకీయాలు, కల్లబొల్లి మాటలతో పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు ఎవరైనా, ఎప్పుడైనా వచ్చి వెళ్లే స్వేచ్ఛ ఉందని, అయితే ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా విపక్షాలు ఏకతాటిపైకి రావడంతో బీజేపీ, దాని మిత్రపక్షాల పునాదులు కదులుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు తరుముతుంటే ఏపీ చుట్టూ చక్కర్లు కొడుతున్న తలసాని ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు.