ఆంధ్రప్రదేశ్
ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 February 2019
విజయవాడ, ఫిబ్రవరి 16: ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాక వరప్రసాద్ శనివారం ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధాన్యం సేకరణ ఏర్పాట్లు ముమ్మరం చేసి, రైతులకు సహకరించాలని కోరారు. ధాన్యం సేకరణలో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సేకరణ వేగవంతం చేసి వారిని ఆదుకోవాలన్నారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలన్నారు.
చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలసిన పౌరసరఫరాల కమిషనర్ వరప్రసాద్