ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ బోర్డు సభ్యులుగా వేనాటి, సుగవాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 17: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా మరో ఇద్దరికి అవకాశం లభించింది. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం మావిళ్లపాడుకు చెందిన వేనాటి రామచంద్రారెడ్డి, కడప జిల్లా రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్‌బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీటీడీ బోర్డు సభ్యురాలుగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే కోరడంతో ప్రభుత్వం ఆమె నియామకాన్ని రద్దు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించినా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో ఆయన నియామకాన్ని దేవాదాయ శాఖ రద్దు చేసింది. దీంతో ఖాళీగా ఉన్న రెండు పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.