ఆంధ్రప్రదేశ్‌

ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా శిద్దా వెంకటేశ్వర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: ఏపీ ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా శిద్దా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంవత్సరం పాటు ఆయన పదవిలో కొనసాగుతారు.
మరోసారి నోటిఫికేషన్
ఒంగోలులో ఏర్పాటు చేయనున్న ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం వర్సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఒంగోలులో వర్సిటీ ఏర్పాటుకు వీలుగా గత ఏడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ అయింది. అనంతరం నిబంధనల మేరకు అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈమేరకు బిల్లును ప్రవేశపెట్టలేక పోవడంతో తాజాగా మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది.