ఆంధ్రప్రదేశ్‌

శవరాజకీయాలకు జగన్ పెట్టింది పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 19: రాష్ట్రంలో శవరాజకీయాలు చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని, శవ రాజకీయాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పెట్టింది పేరని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. నాడు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నించలేదా అని మంగళవారం ట్విట్టర్ వేదికగా జగన్‌ను లోకేష్ ప్రశ్నించారు. అదే రీతిలో నేడు శవాలపై పేలాలు ఏరుకునే విధంగా రాష్ట్రంలో శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నాడు చావు దెబ్బతిన్నా జగన్‌కు బుద్ధి రాలేదని, నేడు మరోసారి తిరిగి శవ రాజకీయం మొదలు పెట్టారన్నారు. ఇప్పుడు కూడా మరోసారి తన దొంగ పత్రిక, దొంగ రాతలతో శవాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజీయం చెయ్యాలని జగన్ ఆరాట పడుతున్నారని ఆరోపించారు. కొండవీడులో రైతు కోటయ్య వ్యక్తిగత కారణాలతో చనిపోతే సానుభూతి ప్రకటించాల్సింది పోయి, నీచ రాజకీయం కోసం వాడకోవడమే వైసీపీ అజెండానా అని లోకేష్ ప్రశ్నించారు. రైతు పొలానికి, సీఎం హెలిప్యాడ్‌కి సంబంధమే లేదన్న విషయం మీకు, మీ దొంగ పత్రికకు తెలియదా అని ద్వజమెత్తారు. వైసీపీ శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువయిందన్నారు. మీ శవ, కుల రాజకీయాలకు త్వరలోనే రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పబోతున్నారన్నారు.