ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్‌కు జవసత్వాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఫిబ్రవరి 19: ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బస్సుయాత్రకు అనూహ్య స్పందన లభించింది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీకారం చుట్టిన బస్సుయాత్రకు నేతలు ఊహించని రీతిలో శ్రేణులు ఉత్సాహంగా తరలిరావడం, కోలాహలంగా వారిని ఆహ్వానించడంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకుల్లో నూతన ఉత్సాహం ఉరకలెత్తింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సొంత ప్రాంతమైన మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి స్వచ్ఛందంగా పార్టీ శ్రేణులు తరలిరావడం నేతల్లో ఉత్సాహం నింపింది. ప్రధానంగా యువకులు అధిక సంఖ్యలో రావడం కాంగ్రెస్‌ను సంబరంలో ముంచింది. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న హిందూపురం, పెనుకొండ ప్రాంతాల్లో కూడా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తరలివచ్చి బస్సుయాత్రను జయప్రదం చేయడంతో నేతల్లో సంతోషం కనిపించింది. మార్గమధ్యలో పలుచోట్ల వాహన శ్రేణిని మహిళలు ఆపి హారతులు పట్టడం కనిపించింది. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో స్తబ్ధత నెలకొనగా ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ చేపట్టిన బస్సుయాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రావడం రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కల్యాణదుర్గం, మడకశిర, శింగనమల నియోజకవర్గాల్లో తప్పకుండా గెలుస్తామని, నిండు మనసుతో మీరు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పాలనలో కీలకమవుతుందని రఘువీరా తనదైన శైలిలో పేర్కొన్నారు.