ఆంధ్రప్రదేశ్‌

ట్రిబ్యునల్ ఆదేశాలను శిరసావహిస్తాం : ఈవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 22 : శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చందనం చెక్క అరగదీత ప్రారంభ ప్రక్రియపై గతంలో నెలకొన్న వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గంధం చెక్కల అరగదీతకి సంబంధించి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి వ్యాఖ్యానించిన నేపథ్యంలో దేవస్థానంతో పాటు అడివివరం ప్రాంతంలో ఈ అంశంపై మళ్లీ చర్చకి తెరలేచింది. ఈ విషయమై మంగళవారం సింహాచలం దేవస్థానం ఈవో కె. రామచంద్రమోహన్‌ని విలేఖరులు వివరణ కోరగా ప్రస్తుత దేవాదాయ ట్రిబ్యునల్‌లో కేసు పెండింగులో ఉందని చెప్పారు. సుమారు నాలుగేళ్ల కిందట ప్రేమ్‌కుమార్ ఈవోగా పని చేసిన కాలంలో లండ వంశీయులను గంధం అరగదీయకుండా నిలిపివేశారన్నారు.