ఆంధ్రప్రదేశ్‌

తన్నుకున్న తమ్ముళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 25:ప్రకాశం జిల్లా చీరాల రాజకీయం మరోకసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే ఆమంచి, సునీత వర్గీయుల మధ్య ఇప్పటికీ పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. ఇలాంటి తరుణంలో జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయం కమిటీ సమావేశం తీరు దానికి ఆజ్యం పోసినట్టయింది. సోమవారం స్ధానిక పాలకేంద్రం ఆవరణలో జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయకమిటీ సమావేశం పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి హాజరైన సునీతవర్గం నేతలు తమను స్థానిక ఎమ్మెల్యే ఆమంచి వేధిస్తున్నారని, ప్రోటోకాల్ పాటించడం లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మంత్రి రావెల కిశోర్‌బాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే తరువాత మాట్లాడతానని సర్ధిచెప్పారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత కూడా తమ సమస్యను వినకుండా వెళ్తున్న మంత్రి రావెల కారును సునీత వర్గం నాయకులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి కాన్వాయ్ వెనుక ఉన్న మంత్రి రావెల అనుచరులు ఒక్కసారిగా కిందకు దిగి మహిళలు, పురుషలని తేడా లేకుండా దారుణంగా కొట్టారు. ఈక్రమంలో చీరాల మండలంలోని విజయలక్ష్మిపురానికి చెందిన పాపంచి రాంబాబుకు కాలువిరగటంతో పోలీసులు అతన్ని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమందికి గాయాలు అయ్యాయి.
కాగా ఒంగోలు -చీమకుర్తి రహదారిపై నేతలు రాస్తారాకో చేపట్టడటంతో రహదారికి ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయ. ఈసందర్భంగా చీరాల జడ్‌పిటిసి పృధ్వీ అరుణ, చీరాల ఎంపిపి గవని శ్రీనివాసరావు,దేవంగపురి సర్పంచ్ పృద్వీ చందన్, దేశాయిపేట ఎంపిటిసి కె గురవయ్య, పాపాయిపాలెం ఎంపిటిసి ఎస్ లక్ష్మి,రామన్నపేట సర్పంచ్ బి అనంతలక్ష్మి, సాల్మన్‌సెంటరు సర్పంచ్ ఎ ధనలక్ష్మి విలేఖర్లతో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ ఆగడాలకు అంతేలేకుండా పోయిందన్నారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టిన సునీత వర్గానికి చెందిన తమను పిలవటంలేదన్నారు. 35సంవత్సరాలనుండి పార్టీజెండా మోసిన తమకు గుర్తింపులేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను స్వయంగా జిల్లా ఇన్‌చార్జీమంత్రికి వినతిపత్రం రూపంలో ఇచ్చి తమ గోడును వెల్లబుచ్చుకునేందుకు వస్తే తమను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే అడ్డగించే తమను మంత్రి అనుచరులు పిడిగుద్దులు గుద్ది గాయపరిచారన్నారు. ఇలాంటిమంత్రిని కైబినేట్‌నుండి సస్పెండ్ చేయాలనిడిమాండ్ చేశారు. మంత్రి ప్రైవేటు సిబ్బంది చేసిన నిర్వాహకానికి నిరసనగా మంగళవారం చీరాల బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. వెంటనే జిల్లాపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు దామచర్ల జనార్ధన్ స్పందించి రాస్తారాకో చేస్తున్న టిడిపినేతలతో సంప్రదింపులు జరిపారు. వచ్చేనెల రెండవవారంలో సమావేశం ఏర్పాటుచేసి ఇరువర్గాల నేతలను పిలిపించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు.