ఆంధ్రప్రదేశ్‌

కూలిన పాత మిద్దె ఐదుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 26: వర్షానికి నానిన పాత మిద్దె కుప్పకూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట గ్రామపంచాయతీ ఉచ్చలవరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అంగంపల్లె చిన్నగురువయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించాడు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి గోడలు నాని మిద్దె ఒక్కసారికి కుప్పకూలింది. పెద్ద శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా మట్టిదిబ్బ కనిపించింది. ఈ దుర్ఘటనలో గురువయ్య (55), అతని భార్య పెంచిలమ్మ (52), చిన్నకూతురు జి.హరిత (25), ఆమె కుమారుడు నవనీత్ (2), పెద్దకుమార్తె లలిత కుమారుడు కె.యశ్వంత్ (7) అక్కడికక్కడే మృతి చెందారు. లలిత, చిన్నకుమార్తె కూతురు నిహారిక (11) తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులకు రూ.4 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.