ఆంధ్రప్రదేశ్‌

జనసేన రెండవ జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 18: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్లమెంట్, అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థులతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థినికి కూడా పవన్‌కళ్యాణ్ ప్రకటించారు.
సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్‌గౌడ్‌ను బరిలో దించాలని పవన్‌కళ్యాణ్ నిర్ణయించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి అరకు -పంగి రజారావు, మచిలీపట్నం -బండ్రెడ్డి రాము, రాజంపేట -సయ్యద్ ముకరం బాంద్, శ్రీకాకుకుళం -మెట్టా రామారావులను ఎంపిక చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇచ్చాపురం- దాసరి రాజు, పాతపట్నం - గేదెల చైతన్య, అముదాలవలస -రామ్మోహన్, మాడుగుల -జి సన్యాసినాయుడు, పెందుర్తి-చింతలపూడి వెంకటరామయ్య, చోడవరం- పివిఎస్‌ఎన్ రాజు, అనకాపల్లి -పంతం నానాజీ, రాజానగరం -రాయపురెడ్డి ప్రసాద్, రాజమండ్రి అర్బన్ -అత్తి సత్యనారాయణ, దెందులూరు- గంటసాల వెంకటలక్ష్మీ, నరసాపురం -బొమ్మడి నాయకర్, నిడదవోలు -అటికల రమ్యశ్రీ, తణుకు -పుసుపులేటి రామారావు, అచంట -జవ్వాది వెంకట విజయరామ్, చింతలపూడి -మేకల ఈశ్వరయ్య, అవనిగడ్డ -ముత్తంశెట్టి కృష్ణారావు, పెడన -అంకెం లక్ష్మీ శ్రీనివాస్, కైకలూరు -బివి రావు, విజయవాడ వెస్ట్ -పోతిన వెంకట మహేష్, విజయవాడ ఈస్ట్ -బత్తిన రాము, గిద్దలూరు -షేక్ రియాజ్, నెల్లూరు జిల్లా కోవూరు -టి రాఘవయ్య, అనంతపురం అర్బన్ -డాక్టర్ కె రాజగోపాల్, కడప -సుంకర శ్రీనివాస్, రాయచోటి -ఎస్‌కె హసన్‌భాషా, దర్శి -బొటుకు రమేష్, ఎమ్మిగనూరు -రేఖగౌడ్, పాణ్యం -చింతా సురేష్, నందికొట్కూరు - అన్నపురెడ్డి బాల వెంకట్, తంబళ్లపల్లి -విశ్వం ప్రభాకరరెడ్డి, పలమనేతరు -చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్‌లను పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఎంపిక చేశారు. వీరితో పాటు చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున పోలూరు శ్రీకాంత్ నాయుడు బరిలో నిలవనున్నారు.
వామపక్షాలు, బీఎస్పీల పొత్తుతో జనసేన సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవనుంది. పొత్తుల్లో భాగంగా ఏపీలో బీఎస్పీకి మూడు లోక్‌సభ, 21 శాసనసభ స్థానాలను, వామపక్ష పార్టీలకు 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను జనసేన కేటాయించింది. జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు 64 అసెంబ్లీ, 4 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. త్వరలోనే మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించనున్నారు.