ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 March 2019
ప్రొద్దుటూరు, మార్చి 19: కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ టికెట్ లింగారెడ్డికి ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే వరద వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. పార్టీ జెండాలు, బ్యానర్లు తగులబెట్టారు. లింగారెడ్డికి, చంద్రబాబుకు వ్యితిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జెండా తొలగించి దాని స్థానంలో నల్లజెండా ఏగురవేశారు. సీఎం డౌన్ డౌన్, టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ నాయకుడు వరదరాజులరెడ్డిని కాదని లింగారెడ్డికి టికెట్ ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు.