ఆంధ్రప్రదేశ్‌

పొట్లూరి నోట.. మోదీ మాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: చంద్రబాబు నాయుడు ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అని ఐదు కోట్ల ప్రజలకి భరోసా ఇచ్చి ముందుకెళ్తుంటే, వైకాపా నాయకులు మాత్రం ప్రత్యేకహోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. ప్రధాని మోదీ బాటలో జగన్ మాటను విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ నోట వినిపించారన్నారు. గురువారం ఉండవల్లి మీడియా పాయంట్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ విజయవాడలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో పార్టీల భావాలపై జరిగిన చర్చలో ప్రత్యేక హోదా అనేది ఒక బోరింగ్ సబ్జెక్ట్ అని వైసీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడటంతో వారి చిత్తశుద్ధి బయటపడిందన్నారు. జగన్ మాట ఆయన తరఫున పీవీపీ నోటినుండి వచ్చిందన్నారు.