ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుకు ‘ఒంగోలు’ను కానుకగా ఇస్తా: శిద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 21 : ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి 70 వేల మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పార్లమెంట్ సీటును కానుకగా ఇస్తానని రాష్ట్ర అటవీశాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శిద్దా రాఘవరావు అన్నారు. ఒంగోలులో గురువారం ర్యాలీగా బయల్దేరి కలెక్టరేట్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్‌కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ర్యాలీలో మంత్రి శిద్దాతో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, కొండపి, కనిగిరి ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, కదిరి బాబూరావు, శిద్దా తనయుడు సుధీర్‌బాబుతో పాటు మంత్రి కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు ఉన్నారు. నామినేషన్ అనంతరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి శిద్దా మాట్లాడుతూ ఒంగోలు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సైతం భారీ మెజార్టీతో గెలుపొందనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ జిల్లాలోని 12 నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్నారు.