ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు నామినేషన్‌కు విరాళాలు సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, మార్చి 21: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి ధరావత్తు రుసుమును టీడీపీ నేతలు విరాళాల రూపంలో గ్రామాల్లో తిరిగి సేకరించారు. గురువారం మండల పరిధిలోని శాంతీపురం, వెంకటేపల్లి, సోగడబల్ల, బోయనపల్లి, కెనుమాకులపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ నేతలు హుండీలు చేతబట్టి ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ముప్ఫై సంవత్సరాలుగా కుప్పం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా చంద్రబాబు ఆసరాగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, సీడీసీ ఎం ఎస్ చైర్మన్ శ్యామరాజు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రం.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోగడబల్ల గ్రామంలో
విరాళాలు సేకరిస్తున్న టీడీపీ నేతలు