ఆంధ్రప్రదేశ్‌

జనసేన పార్టీ ఐదో జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 21: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే జనసేన అభ్యర్థుల ఐదో జాబితాను పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ విడుదల చేశారు. ఐదవ జాబితాలో 4 లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా జనసేన పార్టీ అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభకు సంబంధించి విజయనగరం- ముక్కా శ్రీనివాసరావు, కాకినాడ- జ్యోతుల వెంకటేశ్వరరావు, గుంటూరు- బీ శ్రీనివాసరావు, నంద్యాల- ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి సంబంధించి డాక్టర్ భూక్యా భాస్కర్‌నాయక్‌ను పార్టీ అభ్యర్థిగా పవన్ నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ అభ్యర్థులు: సాలూరు- బోనెల గోవిందమ్మ, పార్వతీపురం- గొంగడ గౌరీ శంకరరావు, విజయనగరం- డాక్టర్ పెదమజ్జి హరిబాబు, పిఠాపురం- మాకినీడు శేషుకుమారి, చీపురుపల్లి- మైలపల్లి శ్రీనివాసరావు, బొబ్బిలి- గిరదా అప్పలస్వామి, కొత్తపేట- బండారు శ్రీనివాసరావు, రామచంద్రపురం- పోశెట్టి సూర్యచంద్రరావు, జగ్గంపేట- పాటంశెట్టి సూర్యచంద్రరావు, నూజివీడు- బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు, మైలవరం- అక్కల రామ్మోహన్‌రావు, సత్తెనపల్లి- వై వెంకటేశ్వరరెడ్డి, పెదకూరపాడు- పుట్టి సామ్రాజ్యం, తిరుపతి- చదలవాడ కృష్ణమూర్తి, శ్రీకాళహస్తి- వినుత నగరం, గుంతకల్లు- మధుసూదన్ గుప్తా.