ఆంధ్రప్రదేశ్‌

ఎక్సైజ్ సిబ్బందికి త్వరలో బాడీ ఓర్న్ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: ఎక్సైజ్ సిబ్బందికి అతి త్వరలో బాడీ ఓర్న్ (శరీరానికి బిగించుకునే) కెమెరాలు అందించనున్నట్లు రాష్ట్ర ఎక్సయిజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎక్సైజ్ దాడులకు సంబంధించిన తక్షణ సమాచారం, ఆడియో, వీడియోలను ప్రత్యక్షంగా కేంద్ర కార్యాలయంలో వీక్షించగలిగేలా బాడీ ఓర్న్ కెమెరాలు పని చేస్తాయని, వాటిని విజయవాడ కేంద్ర కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌తో అనుసంధానం చేస్తామన్నారు. బాడీ ఓర్న్ కెమెరాలను శరీరానికి కళ్లుగా చెప్పవచ్చని, ఇప్పటి వరకు ఈ వ్యవస్థలను పోలీస్ శాఖ మాత్రమే వినియోగిస్తోందన్నారు.
కోటి రూపాయల అంచనా వ్యయంతో విజయవాడ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను శుక్రవారం కమిషనర్ లాంఛనంగా ప్రారంభించారు. ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, మీనా మాట్లాడుతూ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలో సీసీసీ పని చేస్తుందని 24 గంటలు సిబ్బంది సేవలు అందించేలా ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆలంబనతో అబ్కారీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రూపొందించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం డిపోలు, మద్యం, బీరు తయారీ కేంద్రాలు, చెక్ పోస్టుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశామని, అక్కడి పరిణామాలను ఆనుక్షణం పరిశీలించవచ్చని మీనా వివరించారు. సీసీసీలో ఎనిమిది అతిపెద్ద ఎల్‌ఇడీ తెరలను ఏర్పాటు చేశామని, వాటిలో డిస్టలరీల కోసం రెండు, డిపోల కోసం రెండు, చెక్‌పోస్టులను పరిశీలించేందుకు రెండింటిని కేటాయించగా, మరో రెండు తెరలను ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ కోసం నిర్దేశించామన్నారు. ప్రతి డిపో, డిస్టలరీలకు రెండు కెమెరాల వంతున 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అదే క్రమంలో చెక్‌పోస్టుల వద్ద 31 సీసీ కెమెరాలు ప్రత్యక్ష నిఘాలో సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఎక్సైజ్ కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఇసీఎంఎస్) సైతం మంచి ఫలితాలను ఇస్తుందని, నేరం జరిగిన ప్రాంతానికి సిబ్బంది చేరుకున్న మరుక్షణం అక్కడి ఫోటోలను కూడా అప్‌లోడ్ చేయాలని ఆదేశించామని, తద్వారా సిబ్బంది పనితీరును కూడా సమీక్షించే అవకాశం ఏర్పడుతుందని మీనా అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డీసీతో పాటు, ఒక ఎఇఎస్, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, 13 మంది కానిస్టేబుళ్లు 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారన్నారు. కార్యక్రమంలో సంయుక్త కమిషనర్‌లు దేవకుమార్, ఓఎస్‌డీ నాగేశ్వరరావు, డీసీ కంప్యూటర్స్ రేణుక, ఎసీ-ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రణవి, జీఎం-ఆపరేషన్స్ శ్రీష, సీసీసీ ఇన్‌ఛార్చి మధుబాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.