ఆంధ్రప్రదేశ్
బాబు సభలో అపశ్రుతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 March 2019
ఆచంట, మార్చి 23: పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన చంద్రబాబు ఎన్నికల సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. కొఠాలపర్రు శివారు వీరప్పచెర్వుకు చెందిన కడలి నాగమణి (60) అనే మహిళ గుండెపోటుతో మృతిచెందింది. చంద్రబాబు ఉపన్యాసం అయిపోగానే మహిళలంతా ఒక్కసారిగా వెనుతిరిగి వెళుతుంటే బారికేడ్లు దగ్గరకు వచ్చే సరికి నాగమణి గుండెపోటు వచ్చింది. ఈమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళేసరికే ప్రాణాలు కోల్పోయింది. సంఘటన జరిగిన వెంటనే మంత్రి పితాని సత్యనారాయణ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు.