ఆంధ్రప్రదేశ్‌

పిడుగుపాటుకు బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, మార్చి 24: స్థానిక లక్ష్మమ్మ పేరంటాలు గుడి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం వర్షంతోపాటు పిడుగు పడడంతో పదకొండేళ్ల బాలుడు మృతి చెందాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం పంచాయతీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్న సోమాదుల అప్పలరాజు కుటుంబం స్థానిక ఐటిఐ కాలనీలో నివసిస్తోంది. తనకున్న ఇద్దరు కుమారులు, భార్యతో కలిసి అమ్మవారి గుడి సమీపంలోఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షంతోపాటు పిడుగులు పడడంతో ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న అప్పలరాజు రెండో కుమారుడు శశివర్దన్ ఉరఫ్ జోజు(11)పై పిడుగు పడడంతో శరీరం కాలిపోయింది. ఈ విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆదివారం సెలవ కావడంతో వైద్యులు లేకపోతే పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. బాలుని మృతిపై పోలీసులకు సమాచారం అందించారు.