ఆంధ్రప్రదేశ్‌

వచ్చేది మా ప్రభుత్వమే: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, ఏప్రిల్ 11: ‘రాష్ట్ర ప్రజలకు మాపై నమ్మకముంది.. అలాగే దేవుని ఆశీస్సులు మాపై ఉన్నాయి.. ఈ ఎన్నికల్లో గెలుపు మాదే’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందుల మున్సిపల్ పరిధిలోని బాకరాపురంలో ఉన్న 134వ నెంబరు పోలింగ్ బూత్‌లో జగన్ గురువారం ఉదయం 7.55 గంటలకు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన జగన్ ఓటు వేసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎవరు తమకు మేలు చేసేది ప్రజలకు తెలుసునన్నారు. సంక్షేమ పథకాలను సక్రమంగా ఎవరు అమలుపరుస్తారో వారికే ప్రజలు పట్టం కడతారన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటీ తప్పకుండా నెరవేర్చి రాష్ట్ర ప్రజల్లో సంతోషాన్ని నింపుతామన్నారు.