ఆంధ్రప్రదేశ్‌

‘బీసీ పేరుతో నాటకాలాడుతున్న మోదీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ప్రధాని మోదీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీసీ పేరుతో నాటకలాడుతున్నాడని పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగాధర్ విమర్శించారు. గురువారం విజయవాడ ఆంద్రరత్నభవన్‌లో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ తాను బీసీ కాబట్టే తనను కాంగ్రెస్ అవమానిస్తున్నదని ఆరోపిస్తున్న మోదీ ఏనాడూ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. కేవలం మతం, కులం పేరుతో ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని నాటకలాడుతున్నాడన్నారు. బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ మాత్రమేనని అందరికీ తెలిసిందేనన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీసీలకు స్కాలర్‌షిప్, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సేనన్నారు. 1991లో కేంద్ర ఉద్యోగాల్లో, 2008లో విద్యా సంస్థల్లో కూడా కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందన్నారు.