ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించినా టీడీపీదే అంతిమ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 20: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగుదేశం పార్టీదే అంతిమ విజయమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గతంలో ఇలాంటి ఎలక్షన్ కమిషన్‌ను తాము ఎప్పుడూ చూడలేదన్నారు. గత ఎన్నికల తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షలు చేస్తే ఈసీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌కు 157 ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదుల్లో రిగ్గింగ్, అదనపు ఓట్లు పోల్ కావడం వంటి కీలక అంశాలపై ఫిర్యాదులు చేసినా స్పందన లేదన్నారు. తప్పుడు విధానాలతో ఎవరో గెలవాలన్నట్టుగా ఈసీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించవద్దని ఈసీ చెప్పినట్లుగా మీడియా ద్వారా తెలిసిందని, సీఈసీ ద్వివేది పంతానికి పోకుండా సమీక్షలు నిర్వహించుకోవచ్చని చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.