ఆంధ్రప్రదేశ్‌

సిమ్లాలో ప్రభుత్వ బడిని సందర్శించిన రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: ఎన్నికల సమరంలో గత కొన్ని మాసాల పాటు శ్రమించిన పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి కాస్తంత ఆటవిడుపులో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో కుటుంబ సభ్యులతో వేసవి విహారం చేస్తూ మంగళవారం దుంగాగావ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ పాఠశాల ఎంతో పురాతనమైనదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రారంభించారని తెలిపారు. ఆ గ్రామంలో ప్రస్తుతం 50 కుటుంబాలు నివసిస్తుండగా ఆ పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నదన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్డి సౌకర్యం బాగుందని, పాఠశాల గదుల్లో చక్కటి సౌకర్యాలున్నాయని రఘువీరారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆ పాఠశాల ఉపాధ్యాయులకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
చిత్రం... సిమ్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి