ఆంధ్రప్రదేశ్‌

ప్రజల సమస్యలు పట్టించ కోకుండా విదేశాల్లో జగన్ విహారం : లంకా దినకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 23: ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన సేవలను అడ్డుకుంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. మోడల్ కోడ్ కండక్ట్‌ను మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్‌గా మార్చిన వైసీపీ నేతలకు ప్రజల ఇబ్బందులు పట్టడం లేదన్నారు. వైసీపీ నేతలు ఎన్నికల ప్రవర్తన నియమావళి చదవకుండా ప్రతి విషయానికి వక్రభాష్యం చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఎమ్మెల్యే, మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఎన్నికల కోడ్‌పై అవగాహన లేకుండా మాట్లాడటం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. నిబంధనలు తెలియకపోతే తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి పదవీకాలం జూన్ 18వ తేదీ వరకు ఉంటుందని, చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఏ మాత్రం ఉల్లఘించలేదన్నారు. పరిమితులకు లోబడే సమీక్షలు చేశారని, పెనుగాలులు, అకాలవర్షాలకు పులివెందులలో అరటితోటలు ధ్వంసమైతే అక్కడ రైతుల కడగండ్లను పట్టించుకోకుండా ఆ ప్రాంత ప్రజాప్రతినిధి జగన్ విదేశాలకు వెళ్లడం శోచనీయమన్నారు.